న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆధార్ చట్టంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటివరకు ఆధార్ వివరాలను వాడుకొనే (అథెంటికేషన్) అవకాశం ప్రభుత్వ శాఖలకు మాత్రమే ఉండగా, ఇక నుంచి ప్రజా సంక్షేమం, సుపరిపాలన వ్యహారాల కోసం ప్రైవేటు సంస్థలు కూడా వాడుకొనేందుకు అవకాశం కల్పించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేసే సంస్థలు మే 5 లోపు ఆధార్ అథెంటికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.
ప్రైవేటు సంస్థలు ఎందుకోసం ఆధార్ అథెంటికేషన్ కోరుతున్నాయి? అందులో ప్రజా ప్రయోజనాలు ఉన్నాయా? ప్రజా జీవితాన్ని సులభతరం చేసే అంశాలు ఉన్నాయా? డాటా దుర్వినియోగం కాకుండా చూసే సామర్థ్యం ఉన్నదా అనే అంశాలను పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తులను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు పంపుతారు. అనుమతులు ఇవ్వటంపై ఆ శాఖ తుది నిర్ణయం తీసుకొంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.