కొత్తగూడెం క్రైం : చత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ గ్రామస్తుడిని హతమార్చిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఎరబోర పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంగ్డా గ్రామానికి చెందిన గ్రామస్తుడు దారె నవీన్ అనే యువకుడిని మావోయిస్టులు సోమవారం రాత్రి అపహరించి తీసుకెళ్లారు.
అదే గ్రామ సమీపంలో నవీన్ని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ విషయమై తెల్లవారుజామున సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఇన్ఫార్మర్ నెపంతో గుర్తుతెలియని మావోయిస్టులు నవీన్ ను హతమార్చినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.