ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణం జరిగింది. షేర్డ్ టాక్సీలో వెళ్తున్న యువతిపై అదే టాక్సీలో ఎక్కిన మరో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఎత్మాద్పూర్ ఏరియాలో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాను షేర్డ్ టాక్సీ బుక్ చేసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో మరో ముగ్గురు యువకులు ఎక్కారని, ఆ ముగ్గురూ కలిసి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించారు.