బంగ్లాదేశ్ రైళ్లలో ఎప్పుడు చూసినా జనం రద్దీ కనిపిస్తుంటుంది. రైలు బోగీల్లోకి ఎక్కేందుకు ఒకరినొకరు తోసుకోవడం, కొట్లాడుకునే వీడియోలు సోషల్మీడియాలో ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు ఫుట్బోర్డుపై వేలాడుతూ అతి ప్రమాదకరంగా వెళ్తుంటే, మరికొందరు రైలు బోగీపైన ఎక్కి ప్రయాణిస్తున్నారు. కాగా, రైలులో సీట్లు దొరక్కపోవడంతో ఓ మహిళ బోగీపైకి ఎక్కేందుకు నానా తంటాలు పడింది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది.
బంగ్లాదేశ్లోని ఓ స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఆగి ఉంది. రైలు మొత్తం జనాలతో నిండిపోయింది. దీంతో చాలామంది బోగీపైకి ఎక్కి కూర్చున్నారు. ఓ మహిళ పైకి ఎక్కేందుకు ప్రయత్నించినా విఫలమైంది. నానా తంటాలు పడింది. చివరకు రైల్వే పోలీసులు వచ్చి ఆమెను వారించడంతో అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ షాకింగ్ దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఇలా బోగీపై ప్రయాణించడం క్రిమినల్ నేరం కాదా? అని నెటిజన్లు ప్రశ్నించారు. ఈ సన్నివేశం ‘గదర్ ఏక్ ప్రేమ్కథ’ చిత్రాన్ని గుర్తుచేసిందని ఒక యూజర్ కామెంట్ చేశారు.