భోపాల్: మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ ఆలయానికి చెందిన ముగ్గురు పూజారులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా పూజారి ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితులపై చర్యలు తీసుకోకపోతే.. భోపాల్లోని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటి ముందే ఆత్మాహుతి చేసుకొంటానని ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ… ఈ విషయంపై తాను హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాను కూడా కలిసాశానని, అయితే ఎటువంటి ఫలితం లేదని తెలిపారు.