న్యూఢిల్లీ :క్యాప్సూల్స్ రూపంలో కొకైన్ను మింగి స్మగ్లింగ్ చేస్తున్న గినియా-బిస్సావు దేశానికి చెందిన మహిళను కస్టమ్స్ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకొన్నారు.
దవాఖానకు తరలించి, ఆమె కడుపులో నుంచి 724 గ్రాముల బరువున్న 59 క్యాప్సూల్స్ను బయటకు తీశారు. వీటి విలువ రూ.11 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.