న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని రాయిసన్ జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఓ మహిళ(40)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం పొలం నుంచి ఇంటికి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు తనపై దాడి చేసి, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొన్నది.
మరోవైపు సాత్నా జిల్లాలో ఓ మైనర్ బాలికపై లైంగికదాడి జరిగింది. నాలుగురోజుల్లో ఇది రెండో ఘటన. శుక్రవారం మధ్యాహ్నం మైనర్ బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి నిందితుడు లైంగికదాడికి పాల్పడ్డాడని ఆరోపణలు నమోదయ్యాయి.