న్యూఢిల్లీ : దేశంలో టాలెంట్కు ఎలాంటి కొదవ లేదనేందుకు సోషల్ మీడియా సరైన ఉదాహరణగా ముందుకొస్తోంది. మహాబలేశ్వర్ వీధుల్లో ఓ మహిళ లతా మంగేష్కర్ ఆలపించిన సునో సజ్నా పపిహె నేను శ్రావ్యంగా పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంగీత ప్రియులను ఈ వీడియో ఆకట్టుకుంటోంది.
ఈ వైరల్ వీడియోను సయ్యద్ సల్మాన్ అనే యూజర్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్లో మహిళ 1966లో విడుదలైన ఆయే దిన్ బహర్ కే మూవీ నుంచి లతాజీ పాడిన పాటను తనదైన శైలిలో ఆలపిస్తూ నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఆమె గొంతులో ఈ పాట మరింత శ్రావ్యంగా ఉందని మహిళ టాలెంట్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మహాబలేశ్వర్లోని పంచ్గని సమీపంలోని పార్శీ పాయింట్ వద్ద మహిళ ఈ పాట పాడారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 6 లక్షల మంది పైగా వీక్షించారు. కామెంట్ సెక్షన్లో మహిళ నైపుణ్యాన్ని పలువురు మెచ్చుకుంటూ కామెంట్స్ రాసుకొచ్చారు.