హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): మాల్దీవ్స్ జర్నలిస్టుల బృందం గురువారం హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, భారత్ బయోటెక్ను సందర్శించింది. రెడ్డీస్ లాబొరేటరీస్లో ముఖాముఖి నిర్వహించింది. అనంతరం భారత్ బయోటెక్, జెనోమ్వ్యాలీని సందర్శించింది. అక్కడి సైంటిస్టులతో బయోటెక్ కార్యకలాపాలను బృందం అడిగి తెలుసుకుంది. ఫార్మాస్యూటికల్స్ తయారు చేసే ప్లాంటును బృందానికి యాజమాన్యం చూపించింది.
మధ్యాహ్నం రాయదుర్గంలోని టీహబ్ను సందర్శించి, నిర్వహణను అడిగి తెలుసుకుంది. అనంతరం టీవర్క్స్ను సందర్శించగా, పలు విషయాలను సీఈవో సుజయ్ కారంపురి వివరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల బృందానికి కో-ఆర్డినేటర్గా నాగులపల్లి వెంకటేశ్వరరావు, మీడియా అకాడమీ మేనేజర్ పీసీ వెంకటేశం పాల్గొన్నారు.