జోధ్పూర్, మార్చి 30: ఐఐటీ-జోధ్పూర్, ఢిల్లీ పరిశోధకుల బృందం పండ్ల పక్వాన్ని గుర్తించే సెన్సర్ను సృష్టించింది. లితోగ్రఫీ రహిత డైఎలక్ట్రికల్ పొరతో, నానో నీడిల్ నిర్మాణం కలిగిన పీడీఎమ్ఎస్(పాలీ డై మిథైల్ సిలోక్సేన్)తో ఈ సెన్సర్ నిర్మితమై ఉంటుంది. ఎలాస్టిక్ మాడ్యూల్స్ను కొలవడం ద్వారా వివిధ రకాల టమోటాల పక్వాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ‘రొబొటిక్ పద్ధతిలో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ద్వారా అధిక విలువ కలిగిన పండ్లను గ్రేడింగ్ చేయవచ్చు’ అని డాక్టర్ అజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ వినూత్న సాంకేతికత సాయంతో పండ్ల పక్వం ఆధారంగా వాటిని గ్రేడింగ్ చేయవచ్చన్నారు.