గువాహటి: ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్, అతని అనుచరులను నిర్బంధించిన అస్సాంలోని డిబ్రుగర్ కేంద్ర కారాగారంలో భద్రతా లోపం బయటపడింది.
సింగ్ వద్ద చట్టవిరుద్ధంగా ఉన్న స్పై కెమెరా, స్మార్ట్ఫోన్, కీప్యాడ్ ఫోన్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ హెడ్ఫోన్స్, స్పీకర్స్, స్మార్ట్వాచ్ మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు.