హమీర్పూర్ (హర్యానా) : హర్యానాకు చెందిన నిట్ విద్యార్థి ఎనిమిది కోట్ల రూపాయల విదేశీ స్కాలర్షిప్కు ఎంపికయ్యాడు. హమీర్పూర్లోని నిట్లో ఫిజిక్స్, ఫొటోనిక్స్ సైన్స్లో ఎంఎస్సీ విద్యార్థి దీపక్ భరద్వాజ్ యూకేకు చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీలో పీహెచ్డీకి ఎంపికయ్యాడు. క్వాంటమ్ ఇంజినీరింగ్లో నాలుగేండ్ల పాటు పీహెచ్డీ చేసేందుకు దీపక్కు ఏడాదికి రెండు కోట్ల రూపాయలకు పైగా స్కాలర్షిప్ లభిస్తుంది. తమ విద్యార్థి ఎంపిక కావడం ఇదే ప్రథమమని నిట్ అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.