న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ర్టాల్లో వంధత్వం (సంతానలేమి) రికార్డు స్థాయికి చేరుకుందని, లైంగిక వ్యాధులు, జీవనశైలి, వివాహ వయస్సు.. తదితర కారణాల వల్ల సంతానలేమి ఎక్కువైందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. 1981-2001 నాటికి వంధత్వం 13 నుంచి 16 శాతానికి పెరిగిందని, ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ర్టాల్లో అత్యధిక స్థాయిలో ఉందని నివేదిక పేర్కొన్నది.
కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా, ఢిల్లీ, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లో సమస్య రికార్డు స్థాయికి చేరుకుందని తెలిపింది. దీనిపై ‘ప్లాస్ వన్ జర్నల్’లో కథనం వెలువడింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (1992-2016) డాటాను విశ్లేషించి పరిశోధకులు ఈ నివేదికను తయారు చేశారు.