న్యూఢిల్లీ, జనవరి 17: బెంగళూరు వెళ్లేందుకు ముంబైలో స్పైస్జెట్ విమానమెక్కిన ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. విమానం టాయిలెట్లో ఇరుక్కుపోయి బెంగళూరులో విమానం ల్యాండయ్యే వరకు అందులోనే కూర్చుని ప్రయాణించాల్సి వచ్చింది. ప్రయాణికుడికి ఎయిర్లైన్ సంస్థ క్షమాపణలు చెప్పడంతోపాటు టికెట్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసింది. విమానం బెంగళూరులో ల్యాండయ్యాక ఇంజినీర్లు టాయిలెట్ తలుపులు తెరిచి అతడిని రక్షించారు. ఈ నెల 16న ఈ ఘటన జరిగిందని, మాల్ఫంక్షన్ కారణంగా డోర్లాక్ అయిందని స్పైస్జెట్ పేర్కొంది. ప్రయాణికుడు బయటకు వచ్చేంత వరకు తమ సిబ్బంది అతడితో మాట్లాడుతూనే ఉన్నారని, బెంగళూరులో అతడికి వైద్యసాయం కూడా అందించినట్టు తెలిపింది. ప్రయాణికుడి టికెట్ డబ్బులు వాపస్ ఇచ్చినట్టు స్పైస్జెట్ చెబుతున్నప్పటికీ, డిసెంబరులో రైద్దెన విమానాలకు సంబంధించి టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వలేని పలువురు ప్రయాణికులు ఎక్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.