న్యూఢిల్లీ: ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ ‘ఆకాశ్ ప్రైమ్’ టెస్ట్ సక్సెస్ అయ్యింది. ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి సోమవారం విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తెలిపింది. శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఈ క్షిపణి అడ్డగించి నాశనం చేసినట్లు తెలిపింది. క్షిపణి కొత్త వెర్షన్కు మెరుగుదల అనంతరం తొలిసారి పరీక్షించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. టెస్ట్ సక్సెస్కు సంబంధించిన ఫొటోలు, వీడియోను విడుదల చేసింది.