న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయం తీసుకోనిదే నేడు ప్రపంచదేశాలు ఏ అంశంపైనైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘తిరంగా ఉత్సవ్’ కార్యక్రమంలో షా మాట్లాడారు. మోదీ నాయకత్వంలో నవ్యభారత్ రూపుదిద్దుకున్నట్టు చెప్పుకొచ్చిన ఆయన.. అంతర్జాతీయంగా దేశ గౌరవాన్ని పెంచడంలో మోదీ కృషి మరువలేనిదని పొగడ్తలు గుప్పించారు.