గౌహతి: మన తిరుగుబాటు చరిత్రాత్మకమని ఒక జాతీయ పార్టీ పొగిడిందని శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అన్నారు. అస్సాం రాజధాని గౌహతిలోని ఒక హోటల్లో మకాం వేసిన ఆయన తన వెంట ఉన్న రెబల్ ఎమ్మెల్యేనుద్దేశించి గురువారం మాట్లాడారు. మనందరికీ సహాయం చేస్తానని ఆ జాతీయ పార్టీ భరోసా ఇచ్చిందని తెలిపారు. ‘మన బాధలు, సంతోషాలు ఒకటే. మనం ఐక్యంగా ఉన్నాం. విజయం మనదే. మహాశక్తి అయిన ఒక జాతీయ పార్టీ ఉంది. పాకిస్థాన్ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ పొగిడింది. అన్ని విధాలా సహాయం చేస్తామని భరోసా ఇచ్చింది’ అని అన్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఏక్నాథ్ షిండే కార్యాలయం ఈ మేరకు గురువారం రాత్రి ఒక వీడియోను విడుదల చేసింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఆయనను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ తరుపున తర్వాతి నిర్ణయం తీసుకోవాలని ఏక్నాథ్ షిండేను వారు కోరుతున్నట్లుగా ఈ వీడియోలో ఉంది.
మరోవైపు ఏక్నాథ్ షిండే వెంట 37 మంది శివసేన ఎమ్మెల్యేలతోపాటు 9 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిపి 46 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే రాయబారం కోసం సూరత్కు పంపిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక అనుచరుడు కూడా రెబల్ బృందంలో చేరినట్లు తెలిసింది.
#WATCH | Rebel Maharashtra Shiv Sena MLAs in Guwahati unanimously chose Eknath Shinde their leader. pic.twitter.com/tuhL93rSfV
— ANI (@ANI) June 23, 2022