న్యూఢిల్లీ: 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కారణంగా మరణాల సంఖ్య 50% పెరుగుతుందని, ఏటా 97 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది. స్ట్రోక్కు కారణమైన అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్టరాల్, ఊబకాయం, ధూమపానం, జీవనశైలి.. మొదలైన వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పరిశోధకులు సూచించారు. లాన్సెట్ న్యూరాలజీ జర్నల్ కథనం ప్రకారం.. 2020లో ఆసియాలో 41 లక్షల మంది మరణించగా, 2050 నాటికి ఈ సంఖ్య 66 లక్షలకు చేరుకోనుంది.