ధారావి ప్రాజెక్టును నిరసిస్తూ అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శనివారం ముంబైలో భారీ ర్యాలీ జరిగింది. ధారావి నుంచి అదానీ రియాల్టీ కార్యాలయం ఉండే బాంద్రా కుర్లా కాంపెక్స్ వరకూ ఈ మార్చ్ చేపట్టారు.
అభివృద్ధికి తాము వ్యతిరేకంగా కాదని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) కుంభకోణం అని ఠాక్రే ఆరోపించారు.