అమృత్సర్: పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్కు సమీపంలో గత నెలలో మూడు వేర్వేరు పేలుళ్లు చోటుచేసుకున్న ఘటనను మరువకముందే.. ఇవాళ గోల్డెన్ టెంపుల్కు బాంబులు పెట్టామంటూ పోలీసులకు వచ్చిన ఓ బెదిరింపు కాల్ కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి 1 గంటలకు (తెల్లవారితే శనివారం) గుర్తు తెలియని వ్యక్తి పంజాబ్ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి గోల్డెన్ టెంపుల్ చుట్టుపక్కల నాలుగు బాంబులు పెట్టినట్లు చెప్పాడు.
పోన్ చేసిన వ్యక్తిని పోలీసులు వివరాలు అడుగుతుండానే అతడు కాల్ను డిస్ కనెక్ట్ చేశాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన గోల్డెన్ టెంపుల్కు చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో అణువణువు క్షుణ్ణంగా గాలించారు. కానీ, ఎక్కడా ఎలాంటి బాంబు జాడ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫోన్ లొకేషన్ను ట్రాక్ చేస్తూ నిందితుడి ఇంటి దగ్గరకు వెళ్లారు. అనుమానితుడి గుర్తించి అతని నుంచి ఫోన్ను లాక్కున్నారు. అతడిని స్టేషన్కు తీసుకెళ్లి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే పోలీసుల ఎంక్వయిరీలో నిందితుడు నవ్వుతెప్పించే సమాధానాలు చెప్పాడు. తనకు ఇటీవల ఫోన్ దొరికిందని, ఆ ఫోన్తో కాల్ చేసినా పోలీసులు నన్ను కనిపెట్టలేరనుకుని.. వారిని ఆటపట్టించడం కోసం తప్పుడు ఫోన్ చేశానని తెలిపాడు.