కొల్లాం (కేరళ), సెప్టెంబర్ 25: గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు ఓ జవాన్పై దాడి చేశారు. ఈ ఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. జవాన్పై ఒక్కసారిగా దాడికి దిగిన దుండగులు అనంతరం చేతులు కట్టేసి వీపుపై పీఎఫ్ఐ అని రాశారు. తర్వాత జవాన్ను వదిలేసి పారిపోయారు.
కొద్దిసేపటి తర్వాత తేరుకున్న జవాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అనేది ఓ ఇస్లామిక్ సంస్థ. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.