Flight crash: ఇవాళ (ఆదివారం) ఉదయం ఆఫ్ఘనిస్థాన్లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం భారత్కు చెందినది కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. అది మొరాకో రిజస్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అని, చిన్న విమానమని తెలిపింది. బదాక్షన్ ప్రావిన్స్లో చిన్న విమానం కూలిందని ఆఫ్ఘన్ సమాచార శాఖ స్పష్టం చేసింది.
కాగా, ముందుగా ఆఫ్ఘనిస్థాన్ కూలింది భారత విమానమేనని వార్తలు ప్రసారమయ్యాయి. ఆప్ఘనిస్థాన్కు చెందిన ఓ వార్తా సంస్థ భారత విమానం తోప్ఖానా పర్వతాల్లో కూలిందనే వార్తను ప్రసారం చేయడంతో.. దేశంలోని మీడియా సంస్థలన్నింటిలో ఆదే వార్త మార్మోగింది. చివరకు అది భారత విమానం కాదని డీజీసీఏ తేల్చేసింది.