Lion | అడవికి రారాజైన మృగరాజుకు ఓ శునకం చెమటలు పట్టించింది. ఆ సింహాన్ని శునకం వెంటాడి చుక్కలు చూపించింది. శునకం దెబ్బకు సింహాం పారిపోయింది. ఈ ఘటన గుజరాత్ రాజ్కోట్ జిల్లాలోని లోధికా తాలుకాలోని మాగాణి గ్రామ పరిసరాల్లో వెలుగు చూసింది.
మాగాణి గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాలను జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఓ శునకాన్ని కాపలాగా ఉంచారు. అయితే రెండు రోజుల క్రితం ఆ పంట పొలాల వైపు ఓ సింహాం వచ్చింది. సింహాన్ని చూసిన నల్ల కుక్క ఏ మాత్రం బెదరలేదు. పంట పొలాల నుంచి గ్రామం వైపు వస్తున్న సింహాన్ని ఆ శునకం వెంటాడింది. ఈ ఘటనను చూసి రైతులు ఆశ్చర్యపోయారు. రైతులు అందించిన సమాచారంతో సింహాన్ని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. సింహాన్ని గ్రామ సరిహద్దుల నుంచి శునకం తరిమికొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
గుజరాత్ రాజ్కోట్ జిల్లాలోని లోధికా తాలుకాలోని మాగాణి గ్రామ పరిసరాల్లో సింహాన్ని ఓ శునకం తరిమిన దృశ్యం.. ఆశ్చర్యపోయిన రైతులు pic.twitter.com/PWHbPtjlqo
— Namasthe Telangana (@ntdailyonline) May 11, 2022