ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పోలీసులనుద్దేశించి చేసిన హెచ్చరికలు తెగ వైరల్ అవుతున్నాయి. ”ఎప్పుడూ యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండరు. నరేంద్ర మోదీ కూడా ప్రధాని పదవిలో ఎప్పుడూ ఉండరు. ముస్లింలమైన మేము ఎప్పటి నుంచో మౌనంగానే ఉంటూ వస్తున్నాం. కానీ మీ దురాగతాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోం. కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. అల్లా కచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు. వాతావరణాన్ని కచ్చితంగా మార్చేస్తాం. అప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో చూస్తాం. అప్పుడు యోగి మఠానికి వెళ్లిపోతారు. మోదీ పర్వతాల్లోకి వెళ్లిపోతారు. అప్పుడు ఎవరు వస్తారో చూస్తాం. కచ్చితంగా మిమ్మల్ని గుర్తుంచుకుంటాం” అంటూ ఒవైసీ హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేశారు.