BJP | బెంగళూరు: కర్ణాటకలోని గోకక్ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళిపై చీటింగ్ కేసు నమోదైంది. బ్యాంకుకు రూ.439 కోట్లు చెల్లించకుండా ఎగవేసిందకు జార్కిహోళితోపాటు మరికొందరిపై వీవీ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (బ్యాంకింగ్) రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
బెళగావి జిల్లాలోని గోకక్లో ఉన్న సౌభాగ్య లక్ష్మి సుగర్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా గతంలో జార్కిహోళి వ్యవహరించారని ఈ ఫిర్యాదులో తెలిపారు. 2013-2017 మధ్య కాలంలో రూ.232.88 కోట్ల రుణం తీసుకుని, తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. 2023 ఆగస్టు 31 నాటికి వడ్డీతో సహా రూ.439.07 కోట్లు చెల్లించవలసి ఉందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫ్యాక్టరీ సీఎండీ, డైరెక్టర్లను మార్చారని పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తులో ఉంది.