జైపూర్: బోరు బావుల్లో పడి ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బోర్లు వేసి నీళ్లు పడకపోతే వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడమే చిన్నారుల పాలిట శాపమవుతున్నది. వృథాగా మిగిలిన బోరు బావుల దగ్గరికి వెళ్లవద్దని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పకపోవడం కూడా ఈ దారుణాలకు కారణమవుతున్నది. తాజాగా రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలోగల భోజ్పురా గ్రామంలో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది.
స్నేహితులతో ఆడుకుంటూ వెళ్లి ఓ తొమ్మిదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బాలుడి స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. బాలుడిని రక్షించేందుకు సివిల్ డిఫెన్స్ సిబ్బందిని, NDRF బలగాలను పిలిపించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#WATCH | Jaipur, Rajasthan: A 9-year-old boy fell into a borewell pit in Bhojpura village. Civil Defence and NDRF team on the spot, rescue operations underway pic.twitter.com/V4UtmH0B8T
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 20, 2023