ముంబై: నిర్భయ లాంటి కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటంలేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దిండోషి పోలీస్స్టేషన్ పరిధిలో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది.
ఓ 19 ఏండ్ల యువకుడి తమ ఏరియాలోనే ఉండే మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాధితురాలు తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 376 (అత్యాచారం), పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.