న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 97శాతం మందిలో యాంటీబాడీలున్నాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఈ విషయం ఆరో విడుత సెరో సర్వేలో తేలిందని గురువారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా సర్వే వివరాలు వెల్లడించారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కు యాంటీబాడీలున్నాయని తెలిపారు. 18 ఏళ్లలోపు వారిలో 88, శాతం 18 సంవత్సరాలు పైబడిన వారిలో 97-98శాతం ఉన్నాయని, టీకాలు వేసిన వారిలో యాంటీబాడీలు దాదాపు 97శాతం ఉన్నాయని, టీకాలు తీసుకోని వారిలో 90శాతం సెరో పాజిటివిటీ రేటు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరో విడుత సర్వే ఇప్పటి జరిగిన సర్వేలన్నింటి కంటే అతిపెద్దదని చెప్పారు. సర్వేలో 28వేల రక్త నమూనాలను, 280 వార్డుల నుంచి సేకరించారని తెలిపారు. ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ వస్తే తప్పా.. సెకండ్ వేవ్లాంటి సంక్షోభం వచ్చే అవకాశాలు చాలా తక్కువ పేర్కొన్నారు.