న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుల పేర్లు సర్వాన్ సింగ్, మోహన్ సింగ్. వరుసకు బాబాయి, అబ్బాయి అవుతారు. 75 ఏండ్ల క్రితం దేశ విభజన సమయంలో అబ్బాయైన మోహన్సింగ్ పాకిస్థాన్కు వెళ్లగా, బాబాయి సర్వాన్ సింగ్ భారత్లోనే ఉండిపోయారు. కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా వేదికగా 75 ఏండ్ల తర్వాత వీరిరువురూ సోమవారం కలుసుకున్నారు. మతఘర్షణల్లో కుటుంబసభ్యులను కోల్పోవడంతో మోహన్సింగ్ ఓ ముస్లిం కుటుంబం వద్ద పెరిగారు. దీంతో ఆయన తన పేరును అబ్దుల్ ఖాలీక్గా మార్చుకున్నారు.