న్యూ ఢిల్లీ : గోడకు వేసే రంగులు ఆరేండ్లలోపు చిన్నారుల మెదడును విషపూరితం చేస్తున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఇండియాలో లభించే 90 శాతం పెయింట్స్లో ఉన్న సీసం (లెడ్) ఇందుకు కారణమని తేల్చాయి. 51 పెయింట్స్పై నిర్వహించిన రెండు అధ్యయనాల్లో కేంద్రంవిధించిన పరిమితి (90పీపీఎం)కి మించి లెడ్ ఉన్నట్టు తేలింది.
76.4శాతం అనుమతించదగ్గ పరిమితికంటే 111 రెట్లు ఎక్కువగా సీసం ఉన్నట్టు గుర్తించారు. ఎక్కువ సీసం ఉన్న పెయింట్స్ సూక్ష్మ, మధ్యతరహా పెయింట్స్ తయారీదారుల నుంచే వస్తున్నట్టు కనుగొన్నారు.