అహ్మదాబాద్: గుజరాత్లోని (Gujarat) నవ్సారిలో విషాదం చోటుచేసుకున్నది. మనవడు చనిపోయాడన్న విషయం తెలుసుకుని 90 ఏండ్ల వృద్ధురాలు కుప్పకూలిపోయింది. 90 ఏండ్ల లక్ష్మిబెన్ కసుంద్రాకు 42 ఏండ్ల వయస్సున్న అశ్వినీ కుమార్ అనే మనవడు ఉన్నాడు. అతడు గత కొన్నివారాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతడికి ముంబైలోని ఓ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో సోమవారం అతడు మృతిచెందాడు. దీంతో అంత్యక్రియల కోసం అతడి మృతదేహాన్ని నవ్సారికి తీసుకెళ్లారు.
మనవడు మరణించాడన్న విషయం తెలుసుకున్న లక్ష్మిబెన్ షాక్తో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దవాఖానకు తరలించగా ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మనవడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేసే కమలాబెన్.. అతడు చనిపోయిన రోజునే ఆమె కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది.