న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : డిజిటల్ అరెస్టు అన్నదే లేదని, అదొక పెద్ద సైబర్ మోసమని కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఈ తరహా మోసాలు ఆగటం లేదు. సైబర్ నేరగాళ్లు గ్వాలియర్కు చెందిన 90 ఏండ్ల ఎయిర్ఫోర్స్ రిటైర్డ్ డాక్టర్ నారాయణ్ మహదేవ్ను 25 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్లో ఉంచి అతడి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.2.5 కోట్లను కొల్లగొట్టారు.
దర్యాప్తు సంస్థకు చెందిన అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తి నుంచి మహదేవ్కు జనవరి 25న ఫోన్ కాల్ వచ్చింది. మీ గుర్తింపు పత్రాలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో ఉన్నాయి, అరెస్టు చేయాల్సి ఉందని మహదేవ్ను బెదిరించాడు. ఆన్లైన్ నిఘా పేరుతో 25 రోజులపాటు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అతని ఖాతా నుంచి విడతల వారీగా పలు రకాల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించారు.