పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్మెన్ అదరగొట్టారు. ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్ హాఫ్సెంచరీలతో విజృంభించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్(98:106బంతుల్లో 11ఫోర్లు,2సిక్సర్లు), విరాట్ కోహ్లీ(56: 60 బంతుల్లో 6ఫోర్లు), కేఎల్ రాహుల్(62 నాటౌట్: 43 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), కృనాల్ పాండ్య(58 నాటౌట్: 31బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) వీరవిహారం చేయడంతో టీమ్ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 317 పరుగులు చేసింది.
హిట్మ్యాన్ రోహిత్ శర్మ(28) ఆరంభంలో ఫర్వాలేదనిపించినా శ్రేయస్ అయ్యర్(6), హార్దిక్ పాండ్య(1) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్స్టోక్స్(3/34) కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇబ్బందిపెట్టినా ఆఖర్లో రాహుల్, కృనాల్ విధ్వంసంతో లెక్కసరిచేశారు. ఆరో వికెట్కు ఈ జోడీ చివరి 57 బంతుల్లో 112 పరుగులు రాబట్టింది. మార్క్వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఒకానొక దశలో భారత్ ఐదు ఓవర్ల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. 41వ ఓవర్లో హార్దిక్ ఔటైన తర్వాత భారత్ కనీసం 250 మార్క్ దాటుతుందా అనిపించింది. చివర్లో ముఖ్యంగా కృనాల్ తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసి భారత్కు అనూహ్య స్కోరు అందించాడు.
ఇవి కూడా చదవండి: