ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు శివాంశ్ మోహిలే కేవలం 18 నిమిషాల్లో యమునా నదిని ఈది రికార్డు సృష్టించాడు. ఈ నెల ప్రారంభంలో ఆరాధ్య శ్రీవాస్తవ 22 నిమిషాల్లో నదిని (సుమారు 250 మీటర్లు) దాటాడు. అయినప్పటికీ, శివాంశ్ తన శిక్షకులను ఆశ్చర్యపరిచాడు. అతను తన వయస్సులో ఉన్న ఇతర అబ్బాయిలతో పోలిస్తే తక్కువ సమయంలో నదిని దాటాడు. అందరి ప్రశంసలు పొందాడు.
శివాంశ్ మోహిలే ఠాగూర్ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. నవజీవన్ స్విమ్మింగ్ క్లబ్లో శిక్షణ తీసుకుంటున్నాడు. యమునా నదిలో మీరాపూర్ సింధు సాగర్ ఘాట్ నుంచి ఈత కొడుతూ కేవలం 18 నిమిషాల్లోనే నది ఆవలి ఒడ్డుకు చేరుకున్నాడని కోచ్ త్రిభువన్ నిషాద్ తెలిపారు. శివాంశ్ నది ఈదేటప్పుడు అత్యవసర సహాయం కోసం అతడి వెంట ఐదు పడవలు వెంబడించాయని తెలిపాడు.
నవజీవన్ స్విమ్మింగ్ క్లబ్లో ప్రస్తుతం 100 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారని, కానీ, 2-8 ఏళ్ల వయస్సులో ఈ ఫీట్ సాధించిన మొదటి బాలుడు శివాంశేనని నిషాద్ వెల్లడించాడు.