జైపూర్: పోటీ పరీక్షల శిక్షణకు కేంద్రమైన రాజస్థాన్ కోటాలోని ఒక హాస్టల్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. (Fire Breaks In Hostel Building) మంటలు, పొగలను తప్పించుకునేందుకు కొందరు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ సంఘటనలో 8 మంది విద్యార్థులకు కాలిన గాయాలయ్యాయి. కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో ఉన్న ఐదు అంతస్తుల హాస్టల్ భవనంలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం 6.15 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
కాగా, మంటలు, పొగలు గమనించిన కొందరు విద్యార్థులు తప్పించుకునేందుకు బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ క్రమంలో ఒక విద్యార్థికి కాలు విరిగింది. అలాగే ఆరుగురు విద్యార్థులకు కాలిన గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు హాస్టల్ బిల్డింగ్లో ఉంటున్న విద్యార్థులను బయటకు రప్పించి కాపాడినట్లు పోలీస్ అధికారి చెప్పారు. వారి క్షేమం గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. దీని కోసం హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ అగ్నిప్రమాదం సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.