లక్నో: ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఘటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో 34వ జాతీయ రహదారిపై బులంద్షహర్, అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కంటైనర్ అదుపుతప్పి గోగాజీ భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో 8 మంది మృతిచెందారు. మరో 43 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
బాధితులు యూపీలోని కాస్గంజ్ నుంచి రాజస్థాన్లోని గోగామేడికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 43 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ట్రాక్టర్ను ఘటనా స్థలం నుంచి తొలగించామన్నారు. ట్రక్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
#WATCH | Uttar Pradesh | Visuals from the spot where 8 people died and 43 got injured after a container hit a tractor full of devotees of Gogaji, going to Gogamedi, Rajasthan, from Kasganj, near Ghatal village on National Highway 34 under Bulandshahr police station. pic.twitter.com/yjpqNnOhhJ
— ANI (@ANI) August 25, 2025