Maharashtra | ముంబై : మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం నెలకొంది. భీవండి పట్టణంలో ఆదివారం రాత్రి ఓ రెండు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. భీవండి పట్టణంలోని దుర్గా రోడ్డులో ఉన్న ఓ రెండు అంతస్తుల భవనం ఆదివారం రాత్రి 12:35 గంటలకు కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి సహా ఇద్దరు మహిళలు దుర్మరణంగా చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి వయసు 8 నెలలు కాగా, మహిళలకు 40 ఏండ్ల వయసు ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
#WATCH | Thane, Maharashtra: A two-storey building collapsed in Bhiwandi. Fire Department officer Rajesh Pawar says, “Six people were stuck in the building. We rescued four people. Two people are in a critical state.” pic.twitter.com/Mhwt5sV2gT
— ANI (@ANI) September 3, 2023