హైదరాబాద్: రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది.
మహారాష్ట్రలోని (Maharashtra) అహ్మద్నగర్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. సోమవారం ఉదయం నాసిక్-పుణే జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పికప్ ట్రక్కు కిందికి దూసుకెళ్లింది. దీంతో ట్రక్కు బోల్తాపడింది. దీంతో నలుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.