రాజ్నాద్గావ్: చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే చిరుతిండి పానీపూరీ. కానీ ఇది తినడం వల్లే కొంత మంది ఆసుపత్రిపాలైన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఛత్తీస్గఢ్లోని గటపార్ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఇక్కడ ఇటీవల నిర్వహించిన మార్కెట్లో పానీపూరీ తినడంతో 77 మంది అనారోగ్యం పాలైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 57 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. తొలుత వారిని మెడికల్ సెంటర్కు తీసుకెళ్లిన అధికారులు.. తదుపరి చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు.
ఫుడ్ పాయిజనింగ్ జరగడం వల్లే వీరంతా ఆసుపత్రి పాలైనట్లు అధికారులు వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత కడుపులో తిప్పినట్లు ఉందని కొందరు చెప్పగా, మరికొందరికి వాంతులు అయినట్లు తెలుస్తోంది. వారిలో 26 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయినట్లు అధికారులు వెల్లడించారు.