అహ్మదాబాద్: ఆర్టిస్ట్లు తమ ప్రతిభను ముగ్గుల్లో చూపారు. పలు రంగాల నేపథ్యంగా 125 రకాల చిత్రాలను ముగ్గులతో రూపొందించారు. గుజరాత్లోని రాజ్కోట్ అజంతా ఆర్ట్స్ గ్యాలరీలో శనివారం ఇది జరిగింది. 77 మంది చిత్రకారులు ఇందులో పాల్గొన్నారు.
ఒలింపిక్ బంగారు పతకం విజేత నీరజ్ చోప్రా, సైనికులు, బాహుబలి సినిమాలోని కట్టప్ప వంటి అరుదైన చిత్రాలను ముగ్గులతో వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
అచ్చం పెయిటింగ్ వేసినట్లుగా ఉన్న ఈ ముగ్గుల చిత్రాలను రూపొందించడానికి కళాకారులు వివిధ రంగులను వినియోగించినట్లు ఈవెంట్ నిర్వాహకుడు హరేష్ బద్లియా తెలిపారు.