న్యూఢిల్లీ: ఇండియాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,47,254 మంది కరోనా సంక్రమించింది. నిన్నటితో పోలిస్తే కొత్తగా 29,722 కేసులు అధికంగా నమోదు అయ్యాయి. ఇక 24 గంటల్లోనో వైరస్ బారినపడి 703 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,51,777 గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. యాక్టివ్ కేసులు 20,18,825 ఉన్నాయి. రోజు వారి పాజిటివిటీ రేటు 17.94 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా కొత్తగా 9,692 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే 4.36 శాతం అధిక కేసులు నమోదు అయ్యాయి.