పట్నా: అతను 70 ఏండ్ల వృద్ధుడు. గోవులకు గడ్డికోసం పోలంకాడికి వెళ్లాడు. దూపవడంతో దారిలో కనిపించిన ఓ బోరింగ్ పంపు (Handpump) వద్ద నీళ్లు తాగాడు. అయితే అనుమతి (permission) లేకుండా నీళ్లు తాగడంపై దాని యజమాని ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఈ క్రమంలో బోరింగ్ యజమాని, అతని కుమారుడు ఆ వృద్ధునిపై దాడిచేశారు. దీంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటన బీహార్లోని వైశాలిలో జిల్లా సలెంపూర్లో జరిగింది.
ఆవులకు మేత కోసం శనివారం ఉదయం తన తండ్రి వెళ్లాడని, దూపడంతో దారిలో కనిపించిన ఓ బోరింగ్ పంపు వద్ద నీళ్లు తాగాడని బాధితుని తండ్రి రమేశ్ సైని చెప్పాడు. తమ అనుమతి లేకుండా నీళ్లు తాగడంపై ఆ బోరింగ్ (handpump) యజమాని ఆగ్రహం వ్యక్తంచేశారని, కోపంతో తన తండ్రిని కొట్టారని వెల్లడించారు. దీంతో ఆయన మృతిచెందారన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.