న్యూఢిల్లీ: ఐఏఎఫ్ హెలికాప్టర్ (IAF helicopter)ప్రమాదంలో ఏడుగురు దుర్మణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురి ఆచూకీ లభించలేదు. త్రివిద దళాతిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ 17వీ5 హెలికాప్టర్ తమిళనాడు నీలగిరి కొండల్లోని కూనూరు వద్ద కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు సహా మొత్తం 14 మంది ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని విల్లింగ్టన్ బేస్కు తరలించారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ధృవీకరించింది.
ఈ ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి మండలి అత్యవసరంగా సమావేశమయింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ప్రధాని మోదీకి వివరించారు. కాగా, రాజ్నాథ్ సింగ్ మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు.