Assam | అసోంలోని టిన్సుకియా జిల్లాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కాకోపత్తర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. టాటా మ్యాజిక్ వెహికల్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.