సూరత్: గుజరాత్లోని సూరత్లో భవనం కుప్పకూలిన (Building Collapse) ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని సచిన్ ఏరియాలో ఓ ఐదంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందులో నివసిస్తున్నవారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు శిథిలాల కింది నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశామని సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ ప్రతీచ్ చెప్పారు. మరో ఆరు నుంచి ఏడుగురు చిక్కుకుపోయి ఉంటారని తెలిపారు.
భవనాన్ని 2016లో నిర్మించారని వెల్లడించారు. అయితే గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వానలతో భవనం కూలిపోయిందని చెప్పారు. రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది తెలిపారు. ఓ మహిళను రక్షించామని, హుటాహుటిన ఆమెను దవాఖానకు తరలించామన్నారు. బాధితలంతా ఆ ప్రాంతంలోని ఫ్యాక్టరీలలో పనిచేసే వారేనని సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ పేర్కొన్నారు.
#WATCH | Gujarat: Surat DCP Rajesh Parmar says, “Rescue operation has been going on for 12 hours. One woman has been saved and 7 dead bodies have been recovered and sent for post-mortem… We are clearing the debris…” https://t.co/HVUp7jB6ro pic.twitter.com/609Qf7wYUt
— ANI (@ANI) July 7, 2024