న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఏడు రోజుల క్వారెంటైన్ రూల్ను ఎత్తివేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజుల పాటు సెల్ఫ్ మానిటర్ చేసుకోవాలని కేంద్రం కొత్త ఆదేశాల్లో పేర్కొన్నది. సోమవారం నుంచి ఈ కొత్త గైడ్లైన్స్ అమలులోకి రానున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చేవారిపై గత ఏడాది పలు ఆంక్షలను కేంద్రం విధించిన విషయం తెలిసిందే.