న్యూఢిల్లీ, అక్టోబర్ 13: 1970 నుంచి 2018 మధ్యకాలంలో 69 శాతం జంతుజాలాలు తరిగిపోయాయని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ నివేదిక తెలిపింది. 5,230 రకాలకు చెందిన 32 వేల జంతుజనాభాపై జరిపిన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంది.
సమశీతోష్ణ మండలాల్లో వెన్నెముక గల ప్రాణుల సంతతి వేగంగా తగ్గిపోతున్నదని నివేదిక వెల్లడించింది. దక్షిణ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో ఘోరంగా 94 శాతం జంతుజాలాలు తగ్గిపోవడం గమనార్హం. ఆఫ్రికాలో 66%, ఆసియా-పసిఫిక్లో 55% జంతువులు తగ్గిపోయాయి.