న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నుంచి మంగళవారం నాటికి 24 గంటల్లో 412 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరింది. కరోనాతో ముగ్గురు మరణించారు.
కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు తాజాగా ఆరు వెలుగుచూశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసుల సంఖ్య 69కి చేరింది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అధికారులు సూచించారు.