ముంబై : ముంబై – గోవా కార్డెజ్ క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం సృష్టించింది. షిప్లో 2వేల మంది ప్రయాణించగా.. సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ప్రయాణించిన వారిలో 66 మంది కరోనా బారినపడ్డట్లు గుర్తించారు. షిప్లోని ప్రయాణికులకు మాస్క్లు ధరించాలని, కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించినా.. చాలా మంది అజాగ్రత్తగా ఉన్నారని షిప్ అధికారులు తెలిపారు.
షిప్లో ఉన్న 1,471 మంది ప్రయాణికులతో పాటు పాటు 595 మంది సిబ్బందికి ఆదివారం ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేశారు. సోమవారం ఫలితాలు వెలువడగా.. 66 మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం షిప్ను ముంబైకి సమీపంలోని లైనర్ మోర్ముగావ్ పోర్ట్ క్రూయిజ్ టెర్మినల్కు సమీపంలో లంగరు వేయగా.. ఆర్టీ పీసీఆర్ పరీక్ష ఫలితాలు వెలువడే వరకు ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ షిప్ నుంచి దిగొద్దని అధికారులు ఆదేశించారు.