లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పోలీసులతో కుమ్మక్కైన గూండాలు ఒక వృద్ధురాలి ఇంటిని కూల్చివేశారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వితంతువైన 65 ఏళ్ల అఖ్తరీ బేగం తన కుమార్తె, ముగ్గురు మనవళ్లతో కలిసి ఒక ఇంట్లో ఉంటున్నది. అమ్రీక్ సింగ్ అనే వ్యక్తి కుటుంబం ఇంట్లో గతంలో ఆమె పని చేసింది. ఈ నేపథ్యంలో చాలా కాలం కిందట అతడి తాత నుంచి స్థలాన్ని కొన్నట్లు ఆమె తెలిపింది. ఆ స్థలంలో ఇళ్లు కట్టుకుని అక్కడ నివసిస్తున్నట్లు చెప్పింది. అయితే ఆ ఇంటిని ఖాళీ చేయాలని అమ్రీక్ సింగ్ బలవంతం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.
కాగా, సోమవారం అమ్రీక్ సింగ్, స్థానిక గూండాలతో కలిసి అక్కడకు వచ్చాడు. అఖ్తరీ బేగం నివసిస్తున్న ఇంటిని ట్రాక్టర్లతో కూల్చివేశాడు. ఆమె ఎంత ప్రాధేయపడినా అతడు వినిపించికోలేదు. పోలీసులు కూడా దగ్గరుండి ఈ కూల్చివేతకు సహకరించారు. ఆ ఇంటి కూల్చివేత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రామరాజ్యమైన ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి ఇదీ. లఖింపూర్ ఖేరీలో భూ వివాదం ఉన్న పేద వృద్ధురాలి ఇంటిని బీజేపీ గూండాలు, అక్రమార్కులు ట్రాక్టర్తో కూల్చివేశారు’ అని ఒకరు ఆరోపించారు.
మరోవైపు వృద్ధురాలి ఇంటి కూల్చివేతకు పోలీసులు సహకరించడంపై ఉన్నతాధికారులు స్పందించారు. భీరా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) దీపక్ రాథోడ్, ఒక ఎస్ఐని సస్పెండ్ చేశారు. భూ వివాదంలో వారి జోక్యం, గూండాలకు సహకరించడంపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు.
This is the law and order situation in Ramrajya Uttar Pradesh
BJP Sponsored goons demolished the poor's house with tractor
In Lakhimpur Kheri, some miscreants demolished the poor's house with a tractor over a land dispute. pic.twitter.com/o6f2OeXWNv
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) August 24, 2022